న్యూఢిల్లీ: ప్యాసెంజర్ వెహికల్స్(పీవీ) రిటైల్ అమ్మకాలు డిసెంబర్, 2020 లో 23.99 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) సోమవారం ప్రకటించింది. డిసెంబర్, 2019 లో 2,18,775 ప్యాసెంజర్ వెహికల్స్ అమ్ముడవ్వగా, గత నెలలో 2,71,249 వెహికల్స్ సేల్ అయ్యాయని పేర్కొంది. ఫెస్టివ్ సీజన్ నుంచి వస్తున్న పెంటప్ డిమాండ్(ఒక్కసారిగా డిమాండ్ రావడం) కొనసాగుతోందని తెలిపింది. దేశంలోని 1,270 ఆర్టీఓ ఆఫీస్ల నుంచి సేకరించిన రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా ఫాడా ఈ డేటాను విడుదల చేసింది. కిందటేడాది డిసెంబర్లో 14,24,620 టూ వీలర్లు సేల్ అయ్యాయని, ఇవి డిసెంబర్, 2019 లో అమ్ముడయిన 12,73,318 వెహికల్స్ కంటే 11.88 శాతం ఎక్కువని పేర్కొంది. కమర్షియల్ వెహికల్ సేల్స్ 59,497 యూనిట్ల నుంచి 13.52 శాతం పడిపోయి గత నెలలో 51,454 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రీ వీలర్స్ సేల్స్ అయితే డిసెంబర్లో 52.75 శాతం పడిపోయాయి. 2019, డిసెంబర్లో 58,651 వెహికల్స్ అమ్ముడుకాగా, గత నెలలో 27,715 యూనిట్లకు ఈ సేల్స్ పడిపోయాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 35.49 శాతం పెరిగి 51,004 యూనిట్ల నుంచి 69,105 యూనిట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి సారిగా డిసెంబర్లో వెహికల్ రిజిస్ట్రేషన్లు పెరిగాయని ఫాడా ప్రెసిడెంట్ వింకేష్ గులాటి చెప్పారు. పంటల దిగుబడి బాగుండడంతో పాటు, టూ వీలర్ సెగ్మెంట్ కొత్త ఆఫర్లతో ముందుకు రావడంతో సేల్స్ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్యాసెంజర్ వెహికల్, టూ వీలర్ సెగ్మెంట్లలో కొత్త లాంచ్ పెరిగాయని తెలిపారు. అయినప్పటికీ సప్లయ్ సైడ్ సమస్యలు కొనసాగుతుండడంతో ప్యాసెంజర్ వెహికల్ సేల్స్పై నెగిటివ్ ప్రభావం పడుతోందని అన్నారు.
టూ వీలర్లు, కార్లు, ట్రాక్టర్ల అమ్మకాలు పెరిగాయ్
- బిజినెస్
- January 12, 2021
లేటెస్ట్
- Double iSMART Teaser: సౌండ్ దద్దరిల్లేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డైలాగ్స్తో పూరీ జగన్నాథ్ ఇచ్చిపడేసిండు
- పల్నాడులో విధ్వంసం : గురజాలలో వైసీపీ నేతలపై టీడీపీ వర్గం దాడులు
- Blink Official OTT: ఓటీటీలోకి ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎందులో అంటే?
- కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- అమెరికా వైట్హౌస్లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- నల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు