
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్జెట్ మంగళవారం రద్దయింది. దీంతో 35 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఆందోళనకు దిగారు. సమాచారం ఇవ్వకుండా విమానాన్ని ఎలా రద్దు చేస్తారంటూ ఎయిర్ లైన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడినా వారు పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.