మంత్రి వివేక్‎ను కలిసిన పఠాన్‎చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్

మంత్రి వివేక్‎ను కలిసిన పఠాన్‎చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని పఠాన్‎చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కలిశారు. శనివారం (జూన్ 28) హైదరాబాద్ సోమాజిగూడలో తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఉమ్మడి మెదక్ ఇంచార్జ్ గా నియమితులైన వివేక్ వెంకటస్వామిని కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయన అనుచరులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. 

ఇటీవల సీఎం రేవంత్ కేబినెట్‎లో మంత్రిగా చేరిన వివేక్ వెంకటస్వామికి ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లా ఇంచార్జ్ మంత్రిని కాటా శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, పఠాన్ చెరు నియోజకర్గ కాంగ్రెస్‏లో గత కొద్ది రోజులుగా వర్గ విభేదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‏లోకి వచ్చిన పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య నియోజకవర్గంలో అధిపత్య పోరు నడుస్తోంది. హైకమాండ్ ఎంట్రీతో వివాదం కాస్త సద్దుమణిగింది.