- ఎంసీహెచ్లో మెయిటింగ్ హాల్, కుర్చీలు లేవు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి ఆవరణలోని మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి( ఎంసీ హెచ్ ) ఓపీ వద్ద వెయిటింగ్హాల్, కుర్చీలు లేక మహిళా పేషెంట్లు గంటల తరబడి నిలబడే పరిస్థితి ఉంది. ఓపీ చిట్టీ తీసుకున్నాక గర్భి ణులు, ఇతర గైనిక్సమస్యలున్న పేషెంట్లు తమ నంబర్ వచ్చే వరకు ఆస్పత్రి మెట్ల పైనే కూర్చుంటున్నారు. మరికొందరు నిలబడి ఉండాల్సి వస్తుంది.
ఇటీవలే ఆస్పత్రి ప్రారంభమవగా ఆవరణలో ఖాళీ స్థలం ఉన్నందున వెయిటింగ్ హాల్ నిర్మిస్తే వచ్చిన మహిళా పేషెంట్లకు ఇబ్బందులు తొలగుతాయని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం ఎంసీహెచ్ఆస్పత్రిలో కేవలం ఓపీ విభాగం మాత్రమే పనిచేస్తుందని, త్వరలోనే ఇన్పేషెంట్ల విభాగాన్ని కూడా ప్రారంభించబోతున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -ప్రొ.ఎం.రాజారావు తెలిపారు. వెయిటింగ్హాల్ నిర్మాణం, కుర్చీలను ఏర్పాటు చేస్తామన్నారు.