మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం

మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం

మార్పే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జనసేన పార్టీ అధ్యక్షుడికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఫలితాల్లో కేవలం ఒకే ఒక్క సీటుతో ఆ పార్టీ సరిపెట్టుకుంది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షులు  పవన్ కల్యాణ్ శుక్రవారం   మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఫలితాల సరళి, రాజకీయ పరిణామాలు, కార్యాచరణపై చర్చించారు. నేతలు తమ పరిశీలనకు వచ్చిన అంశాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను  పవన్ కల్యాణ్ కి వివరించారు.

సమావేశం తర్వాత.. జూన్ నెల మొదటి వారం నుంచి మంగళగిరిలో తమ పార్టీ సమావేశాలు నిర్వహించాలని అధ్యక్షుడు పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కొందరు కార్యాలయానికి వచ్చి  పవన్ కల్యాణ్ ని కలిసి మాట్లాడారు. ఎన్నికల సరళితోపాటు కౌంటింగ్ విధానాలను తెలియచేశారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు  పి.రామ్మోహన్ రావు,  మాదాసు గంగాధరం,  తోట చంద్రశేఖర్,  పి.హరిప్రసాద్,  బి.మహేందర్ రెడ్డి,  ఎ.వి.రత్నం,  వై.నగేశ్,  శేఖర్ పులి తదితరులు పాల్గొన్నారు.