తృటిలో తప్పిన ప్రమాదం.. విరిగిన చక్రంతో 10 కి.మీ. ప్రయాణించిన రైలు

తృటిలో తప్పిన ప్రమాదం..  విరిగిన చక్రంతో 10 కి.మీ. ప్రయాణించిన రైలు

బీహార్ లో ముంబైకి వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ కు భారీ ప్రమాదం  తప్పింది.  ముజఫర్‌పూర్ స్టేషన్ నుంచి 2023 జూలై 02 న రాత్రి ట్రైన్ ముంబైకు బయలుదేరింది. అర్థరాత్రి భగవాన్‌పూర్ స్టేషన్ కు సమీపంలో S-11 కోచ్‌ చక్రం పడిపోయింది.

అలాగే చక్రం విరిగినా ట్రైన్ పది కిలోమీటర్లు ప్రయాణించింది. వేగంగా వెళుతున్న రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు ప్రయాణికులకు పెద్ద శబ్దం వినిపించింది, దీంతో వెంటనే వారు  చైన్ లాగి ఆపారు.

ALSO READ:ఈ పని చేస్తే టీమిండియాదే వరల్డ్ కప్..

ఆ తర్వాత స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే సిబ్బంది ట్రైన్ కు మరమ్మత్తులు చేశారు.  అనంతరం కాసేపటికే ట్రైన్ ముదుకు కదిలింది.ప్ర

యాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.