మహేష్ కోసం పవన్ వస్తున్నాడు.. ఫ్యాన్స్కు పూనకాలు కన్ఫర్మ్!

మహేష్ కోసం పవన్ వస్తున్నాడు.. ఫ్యాన్స్కు పూనకాలు కన్ఫర్మ్!

పవన్ కళ్యాణ్(Pawan kalyan) అండ్ మహేష్ బాబు(Mahesh babu) మ్యూచువల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సంబరాలకు రెడీ అవ్వండి. ఒక సినిమా కోసం ఈ ఇద్దరు టాప్ స్టార్స్ వర్క్ చేయనున్నారు. నిజానికి ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఈ కాంబో కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ ఇద్దరు కాంబోలో ఒక సినిమా చూడాలనేది వాల్ల కోరిక కూడా. అయితే తాజాగా సంచారం ప్రకారం ఫ్యాన్స్ కోరిక సగం వరకు తీరెలానే కనిపిస్తోంది. ఎలా అంటే?

ALSO READ:జవాన్ సినిమా మీతోనే చూస్తాను మహేష్.. వైరల్ అవుతున్న షారుఖ్ ట్వీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ గ్లింప్స్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చాయి. అందుకే ఈ సినిమా నుండి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ గుంటూరు కారం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. అదేంటంటే.. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నారట. అయితే అది సినిమాలో పాత్ర కోసం కాదు.. గుంటూరు కారం సినిమాకు తన గాత్రాన్ని అందించనున్నాడట పవన్ కళ్యాణ్. 

గతంలో మహేష్ బాబు కూడా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు పవన్ మహేష్ కోసం తన గాత్రాన్ని అందిస్తున్నారు. దీంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాలకు దర్శకుడు త్రివిక్రమే. అంతేకాదు ఈ ఇద్దరు హీరోలకు త్రివిక్రమ్ తో మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం తోనే అప్పులు మహేష్. ఇప్పుడు పవన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గాత్రంతో రానున్న గుంటూరు కారం సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకోనుందో చూడాలి మరి.