జగన్కు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు రావు : పవన్ కళ్యాణ్

జగన్కు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు రావు : పవన్ కళ్యాణ్

ఏపీ సీఎం జగన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ కు వరాహికి, వారాహికి తేడా తేలియదన్నారు. సరిగ్గా అ, ఆ లు నేర్చుకోకపోతే వరాహికి, వారాహికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. భీమవరంలో పార్టీ శ్రేణులతో సమావేశం అనంతరం పవన్ మాట్లాడారు.  జగన్  కు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు రావన్నారు.  

సీఎం జగన్ కు భవిష్యత్తులో జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద అక్షరాలు నేర్పిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.  తెలుగు ఉచ్చారణ రాని జగన్ వంటి వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరం.దీనికి అందరం బాధపడుతున్నామని పవన్ చెప్పారు.  

తాను చెప్పు చూపించడం వెనుక చాలా పెద్ద కథ ఉందన్నారు పవన్.  తాను చెప్పు చూపించడానికి ముందు చాలా జరిగిందని, తానేమీ ఊరికే చెప్పు చూపించలేదని చెప్పారు పవన్. తానేదో ఊగిపోతూ మాట్లాడుతున్నానని జగన్ తెగ బాధపడిపోతున్నారని.. ఇక నుంచి జగన్ స్టైల్‌లోనే ఇలా.. ఇలా మాట్లాడతానంటూ సీఎంను అనుకరిస్తూ సెటైర్లు వేశారు. 

అసలు అమ్మఒడి లాంటి కార్యక్రమంలో అలాంటి మాటలు మాట్లాడవచ్చునా అని పవన్ ద్వజమెత్తారు.  .. ఈ నెల 30న వారాహి విజయయాత్ర సభ భీమవరంలో ఉంటుందని వెల్లడించారు. ఈ సభకు అందరి సహాయ సహకారాలు కావాలని పవన్ కోరారు. ఈసారి భీమవరంలో జనసేన పార్టీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు.