
వికారాబాద్ , వెలుగు: మర్పల్లిలో పలు వినాయక మండపాలను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సందర్శించి పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.
బాలాపూర్లో పీసీసీ చీఫ్ పూజలు
ఎల్బీనగర్: బాలాపూర్ గణనాథుడిని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమంలో బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు.
జేఎన్టీయూలో అద్దంకి..
కూకట్పల్లి: జేఎన్టీయూ క్యాంపస్లో స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సతీసమేతంగా హాజరయ్యారు. అంతకుముందు గణనాథుడికి పూజలు చేశారు.