రైతుబంధు ఒకటిచ్చి కేసీఆర్ బిల్డప్ ఇస్తుండు: రేవంత్

రైతుబంధు ఒకటిచ్చి కేసీఆర్ బిల్డప్ ఇస్తుండు: రేవంత్

సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.  అన్నం పెట్టే రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సున్నం పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతుబంధు ఒక్కటిచ్చి తామేదో దానకర్ణులం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. అప్పుల భారంతో రైతు మెడకు బిగుస్తోన్న ఉరితాళ్ల సంగతేంటో మోడీ, కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఒక్కో రైతుపై లక్షన్నర అప్పు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ తన నివేదికలో వెల్లడించింది. రైతుల అప్పుల్లో దేశంలో తెలంగాణకు ఐదో స్థానంలో ఉందని చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.