ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రేవంత్ మండిపాటు

ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రేవంత్ మండిపాటు
  • ఫేక్ ప్రచారాల్లో రాటుదేలిండు
  • మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రేవంత్ మండిపాటు

హైదరాబాద్, వెలుగు : బీజేపీ దగ్గర శిష్యరికం చేసి డ్రామారావు.. ఫేక్​ ప్రచారాల్లో రాటుదేలారని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ చూసి ఏం చేయాలో తెలియక.. కోట్ల రూపాయలతో ఫేక్ ప్రచారాలకు దిగారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు కరెంట్ ఇవ్వడంలో దశాబ్దాలపాటు కాంగ్రెస్ విఫలమైందని, ఇప్పుడు కర్నాటక రైతులకు అది తెలిసొస్తున్నదంటూ కేటీఆర్ చేసిన ట్వీట్‌‌‌‌‌‌‌‌కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. 

‘‘నిన్న మొన్నటి దాకా కర్నాటకలో అధికారంలో ఉన్న వీళ్ల మిత్ర పార్టీ బీజేపీ.. 40% కమీషన్లతో ఆ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించింది. అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నది. ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్​ దూసుకెళ్తున్నది. అందుకే పార్టీని బద్నాం చేసేందుకు ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నరు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం’’ అని రేవంత్ ట్వీట్ చేశారు.