మున్సి పల్ ఎలక్షన్ల కోసం పీసీసీ మానిటరింగ్ కమిటీ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మున్సి పల్ ఎలక్షన్ల కోసం పీసీసీ మానిటరింగ్ కమిటీ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్ కోసం పీసీసీ కమిటీని నియమించింది. పార్టీ ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మానిటరింగ్ కమిటీని నియమిస్తూ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఈ కమిటీకి కన్వీనర్​గా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం,  మరో 14 మందిని సభ్యులుగా నియమించారు.  మీడియా కో ఆర్డినేషన్ కమిటీని కూడా పీసీసీ నియమించింది. చైర్మన్ గా రామ్మోహన్, మరో 14 మందిని సభ్యులుగా అపాయింట్ చేసింది.