కేసీఆర్‌కు బీజేపీని ప్రశ్నించే ధైర్యం లేదు

కేసీఆర్‌కు బీజేపీని ప్రశ్నించే ధైర్యం లేదు

తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ల కాలంలో ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా పాలన ఏమాత్రం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.

విభజన హామీలను తీర్చాలని బీజేపీ ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం కేసీఆర్‌కు లేదని ఉత్తమ్ విమర్శించారు. కరోనా కట్టడి చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అన్నారు.  ఉద్యోగాలు భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని ఉత్తమ్ ఆరోపించారు.