
కాశీబుగ్గ, వెలుగు : నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్ముతున్న ఓ వ్యక్తిపై వరంగల్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. వరంగల్ మట్టెవాడ సీఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్టెవాడకు చెందిన ఇరుకుళ్ల వేద ప్రకాశ్ నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 7న పోలీసులు అరెస్ట్ చేశారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మరోసారి నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్ముతూ ఇటీవల మరోసారి మట్టెవాడ పోలీసులకు చిక్కాడు. దీంతో ప్రకాశ్పై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఆర్డర్స్ జారీ చేశారు. దీంతో ప్రకాశ్ను చర్లపల్లి జైలుకు తరలించారు.