సీఎం అభ్యర్థి ఎంపికపై సిద్ధూ కీలక వ్యాఖ్యలు

సీఎం అభ్యర్థి ఎంపికపై సిద్ధూ కీలక వ్యాఖ్యలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి ఎంపికలో ప్రజల నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయించదని, ప్రజలే నిర్ణయిస్తారని బాంబు పేల్చారు. సీఎం అభ్యర్థి విషయంలో మీడియా అడిగిన ప్రశ్నపై స్పందించిన సిద్ధూ  హైకమాండ్ ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందని మీకెవరు చెప్పారని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలుగా ఎవరుండాలనేది పంజాబ్ ప్రజలు నిర్ణయిస్తారని, సీఎంగా పగ్గాలు ఎవరు చేపట్టాలన్నదీ వారి నిర్ణయమేనని తేల్చి చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

పండ్ల వ్యాపారిపై మహిళ దౌర్జన్యం

అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి దూరం