పండ్ల వ్యాపారిపై మహిళ దౌర్జన్యం

పండ్ల వ్యాపారిపై మహిళ దౌర్జన్యం

భోపాల్ : మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ మహిళ రెచ్చిపోయింది. కారుకు తోపుడు బండి తగిలిందన్న కారణంతో వీరంగం సృష్టించింది. బొప్పాయి పండ్లను రోడ్డుపైకి విసిరేసి హంగామా చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా నోరు పారేసుకుంది.
భోపాల్ అయోధ్య నగర్లో ఓ మహిళ కారుకు తోపుడు బండి తగిలింది. దీంతో కారుకు చిన్న డెంట్ ఏర్పడింది. అది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ.. తోపుడు బండిలో పండ్లు అమ్ముతున్న వ్యక్తిని అడ్డుకుంది. ఇష్టానుసారం తిడుతూ బొప్పాయి పళ్లను రోడ్డుపైకి విసిరింది. సదరు వ్యక్తి క్షమించమని కోరినా పట్టించుకోకుండా పండ్లను నేలకేసి కొట్టింది. దీంతో పండ్ల వ్యాపారి నిస్సహాయంగా నిలబడిపోయాడు. అటుగా వెళ్తున్నవారు ఆపే ప్రయత్నం చేసినా మహిళ మాత్రం వినిపించుకోలేదు. చివరకు ఒకరు మాస్క్ లేకుండా బయటకు ఎందుకు వచ్చారని నిలదీయగా.. తన కారు డ్యామేజ్ చేసిన వ్యక్తిని ఆపేందుకు హడావిడిగా వచ్చానంటూ హడావిడిగా అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

కరోనా బారిన వాషింగ్టన్‌ సుందర్‌

హోం ఐసోలేషన్ లో సినీ నటి కీర్తి సురేష్