కరోనా బారిన వాషింగ్టన్‌ సుందర్‌

కరోనా బారిన వాషింగ్టన్‌ సుందర్‌

టీమిండియా వన్డే ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కరోనా బారినపడ్డాడు. దక్షిణాఫ్రికాతో  మూడు వన్డేల సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టు సభ్యుడు వాషింగ్టన్‌ సుందర్‌ కరోనా బారిన పడ్డాడు.ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌ కోసం భారత వన్డే జట్టు రేపు(బుధవారం)కేప్‌టౌన్‌  బయల్దేరాల్సి ఉంది. అయితే.. ముందస్తుగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో సుందర్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో సుందర్ కేప్ టౌన్ విమానం ఎక్కడంపై అనుమానం వ్యక్తమవుతోంది. 
 
గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సుందర్‌.. ఇటీవల విజయ్‌ హజారే ట్రోఫీలో రాణించి వన్డే జట్టులో ప్లేస్  దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా జనవరి 19న తొలి వన్డే, 21న రెండోది, జనవరి 23న మూడో వన్డే ఆడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ సారధిగా వ్యవహరించనున్నాడు.

మరిన్ని వార్తల కోసం..

 మేడారానికి స్పెషల్ బస్సులు.. ధర ఎంతంటే?