పాతబస్తీలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్

పాతబస్తీలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్

పాతబస్తీ ఐ.ఎస్.సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి సైదాబాద్ పీఎస్ పరిధిలోని ఐఎస్ సదన్ లో బాంబు ఉందంటూ డయల్ 100 కి అక్బర్ ఖాన్ అనే వ్యక్తి కాల్ చేశాడు. అనంతరం ఐఎస్ సదన్ కు చేరుకున్న పోలీసులు.. బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. ఫోన్ లో చెప్పినట్టు అక్కడ ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. అయితే కాల్ చేసి, అబద్దం చెప్పిన వ్యక్తిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు... ఫోన్ నెంబర్ ద్వారా నిందితుడిని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. 

అరెస్టు అనంతరం సైదాబాద్ పీఎస్ లో నిందితుడిపై ఐపీసీ సెక్షన్182, 186, సిటీ యాక్ట్ 70 బీ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.  అంతకు మునుపు హైదరాబాద్ లోని పాతబస్తీ ఐ.స్.సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి 100కి ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే బాంబ్ స్కాడ్ అధికారులతో తనిఖీలు మొదలుపెట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అణువణువూ గాలించారు.