దోస్త్​ చావును తట్టుకోలేక ఆత్మహత్య

దోస్త్​ చావును తట్టుకోలేక ఆత్మహత్య
  • గద్వాల జిల్లా అయిజ మండలం భూమ్ పురంలో ఘటన  
  • పక్క పక్కనే అంత్యక్రియలు 

అయిజ, వెలుగు: ప్రాణ స్నేహితుడి మరణ వార్త విని తట్టుకోలేక అతడి మిత్రుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల జిల్లా అయిజ మండలం భూమ్ పురం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ శంకరమ్మ భర్త హనుమంతు (45) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. అతడి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు.

ఇది తట్టుకోలేని హనుమంతు ప్రాణ స్నేహితుడైన హుస్సేని(44) పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. దీంతో హనుమంతు పక్కనే హుస్సేని అంత్యక్రియలు నిర్వహించారు.