కాగ్న బ్రిడ్జిపై యువకుడి ఆత్మహత్య ..

కాగ్న బ్రిడ్జిపై యువకుడి ఆత్మహత్య ..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారు కాగ్న బ్రిడ్జ్ కు ఉరి వేసుకుని జులై 11న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం అంపల్లి గ్రామానికి చెందిన నగేష్​డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అతనికి భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా వికారాబాద్ లోని ఇందిరానగర్​లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో కాగ్న బ్రిడ్జిపై యువకుడు ఉరి వేసుకుని వేలాడుతుండటం స్థానికులకు కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. 

వారు అక్కడికి చేరుకుని మృతుడి వివరాలు.. మృతికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. అతని దగ్గర లభించిన సూసైడ్​నోట్​లో తల్లి ఫోన్ నంబర్​ రాసి పెట్టుందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.