పీఈటీలను నియమించాలె..గుత్తా సుఖేందర్ రెడ్డి

పీఈటీలను నియమించాలె..గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : స్కూల్స్​లో ఆటలకు ప్రత్యేకంగా పీరియెడ్ కేటాయించి.. పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రవీంద్ర భారతిలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన  తెలం గాణ విద్యాదినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గుత్తా సుఖేందర్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై, మాట్లాడారు. తాము చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే ఏదో ఒక ఆట ఆడేవారిమని తెలిపారు. ఆటలతో ఆరోగ్యం పెరుగుతుందని..ప్రతి స్కూల్​లో స్పోర్ట్స్​ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.