రైతు బంధు అందలేదంటూ హైకోర్టులో పిటిషన్

రైతు బంధు అందలేదంటూ హైకోర్టులో పిటిషన్

రాష్ట్రంలో రైతులకు 3, 4వ విడత రైతుబంధు డబ్బులు ఎందుకు చెల్లించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్ట్. 2019-20 ఏడాది ఖరీఫ్-రబీ సీజన్‌ ముగిసినా రైతు బంధు డబ్బులు అందలేదంటూ వరంగల్‌ కు చెందిన రైతు ప్రమోద్ కుమార్.. కోర్టులో పిటిషన్‌ వేశారు. ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసినా.. రైతుబంధు చెల్లించలేదని పిటిషనర్ తెలిపారు. దీనిపై విచారణ చేసిన హైకోర్ట్ రాష్ట్రవ్యాప్తంగా రైతులపై ప్రభావం చూపనుండటంతో.. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. రైతుబంధు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆదేశించింది.