పిటిషనర్​కు రూ.లక్ష ఫైన్ వేసిన హైకోర్టు

పిటిషనర్​కు రూ.లక్ష ఫైన్ వేసిన హైకోర్టు
  • తప్పుడు సమాచారంతో టైం వేస్ట్ చేశారని ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: నిర్మాణాలు పూర్తికాకుండానే బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారంటూ దాఖలైన పిల్​ను హైకోర్టు కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిల్ దాఖలు చేసిన పిటిషనర్​కు రూ.లక్ష పెనాల్టీ వేసింది. నెల రోజుల్లోగా పిటిషనర్​ను నుంచి ఫైన్​ వసూలు చేసి పీఎం కరోనా సహాయ నిధికి చెల్లించాలని సిద్దిపేట కలెక్టర్​ను ఆదేశిస్తూ చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌ సతీశ్​ చంద్రశర్మ, జస్టిస్‌‌ రాజశేఖర్‌‌రెడ్డిల బెంచ్‌‌ ఉత్తర్వులిచ్చింది. అనుమతుల్లేకుండా, బ్లాక్‌‌లో పెట్రోల్, డీజిల్‌‌ అమ్మకాలు చేయాల్సిన అవసరం లేదని హెచ్‌‌పీసీఎల్‌‌ హైకోర్టుకు తెలుపుతూ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించింది. పిటిషనర్ సరైన సమాచారం తెలుసుకోకుండా పిల్ వేసి కోర్టు టైమ్​ను వేస్ట్‌‌ చేశారంటూ ఫైన్​ వేసింది.