- తప్పుడు సమాచారంతో టైం వేస్ట్ చేశారని ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: నిర్మాణాలు పూర్తికాకుండానే బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారంటూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిల్ దాఖలు చేసిన పిటిషనర్కు రూ.లక్ష పెనాల్టీ వేసింది. నెల రోజుల్లోగా పిటిషనర్ను నుంచి ఫైన్ వసూలు చేసి పీఎం కరోనా సహాయ నిధికి చెల్లించాలని సిద్దిపేట కలెక్టర్ను ఆదేశిస్తూ చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ రాజశేఖర్రెడ్డిల బెంచ్ ఉత్తర్వులిచ్చింది. అనుమతుల్లేకుండా, బ్లాక్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేయాల్సిన అవసరం లేదని హెచ్పీసీఎల్ హైకోర్టుకు తెలుపుతూ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించింది. పిటిషనర్ సరైన సమాచారం తెలుసుకోకుండా పిల్ వేసి కోర్టు టైమ్ను వేస్ట్ చేశారంటూ ఫైన్ వేసింది.