మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి పెట్రోల్ రేట్లు పెరిగాయి. వరుసగా మూడు రోజుల గ్యాప్ ఇచ్చిన చమురు కంపెనీ… మళ్లీ రేట్లు పెంచాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి ఇంధన ధరలు చేరాయి. ఈ నెలలో ఏకంగా 15 రోజుల పాటు పెట్రోల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై 4 రూపాయల వరకు ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు.  అయితే జనవరి, ఫిబ్రవరి నెలలో మొత్తం కలిపి పెట్రోల్, డీజిల్ పై దాదాపు 8 రూపాయల వరకు పెంచాయి. తాజాగా ఇవాళ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ కు 91 రూపాయల 17 పైసలు ఉండగా… డీజిల్ లీటర్ కు 81 రూపాయల 47 పైసలకు చేరింది. ముంబై లో పెట్రోల్ 97 రూపాయల 57 పైసలు కాగా…. డీజిల్ 88 రూపాయల 44 పైసలుగా ఉంది. హైదరాబాద్ లో లీటర్  పెట్రోల్  94 రూపాయల.79 పైసలు ఉండగా… డీజిల్  88 రూపాయల 86 పైసలకు చేరింది.