మల్కాజ్ గిరిలో పెట్రోల్ దొంగలు అరెస్ట్

మల్కాజ్ గిరిలో పెట్రోల్ దొంగలు అరెస్ట్

ఉప్పల్,వెలుగు: ట్యాంకర్ల నుంచి పెట్రోల్​ఎత్తుకెళ్తున్న దొంగలను మల్కాజిగిరి ఎస్​ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్​ఓటీ పోలీసులు తెలిపిన ప్రకారం.. చర్లపల్లి పెట్రోలియం​ సంస్థల నుంచి పెట్రోల్, డీజిల్, విమానాల్లో వాడే ఇంధనాన్ని ట్యాంకర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. సోమవారం బీపీసీఎల్ చర్లపల్లిలో పెట్రోల్ ట్యాంకర్(టీఎస్​08యూజీ-2502) విమాన ఇంధనాన్ని లోడ్ చేసుకొని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు వెళ్తుంది.

మార్గమధ్యలో మల్లాపూర్ గోకుల్ నగర్ లో ట్యాంకర్​ను ఆపి  దయానంద్ అనే వ్యక్తి ట్యాంకర్​నుంచి  పెట్రోల్ తీస్తుండగా సమాచారం అందుకున్న ఎస్​ఓటీ పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు. దయానంద్​తో పాటు ట్యాంకర్​ డ్రైవర్​ శ్రీనివాస్​ను అదుపులోకి తీసుకుని నాచారం పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. దయానంద్ పైన గతంలో కూడా నాచారం పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి.