ఫోన్పే కంపెనీ బ్రాండింగ్ని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని చూస్తోందని ఫోన్ పే యాజమాన్యం ఆరోపించింది. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ పార్టీని హెచ్చరించింది. మధ్యప్రదేశ్లోని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వమే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఫోన్పై సింబల్పై సీఎం ఫొటోను ముద్రించి.. దాని కింద'50 % లావో.. కమ్ కరావో '(50 శాతం తీసుకురండి.. పని పూర్తి చేయండి) అనే మెసేజ్తో కూడిన క్యూఆర్కోడ్ఉంది.
రాష్ట్రంలో ఏదైనా పని అమలు చేయడానికి దానికి బదులుగా డబ్బు అడుగుతూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ రాజధాని భోపాల్ అంతటా ఆ పార్టీ పోస్టర్లు వేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ని లక్ష్యంగా చేసుకుని 'పే సీఎం' పేరుతో పోస్టర్ ప్రచారాన్ని చేశారు. ఇలాంటి ప్రచారం నిర్వహించడాన్ని ఫోన్ పే సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ కంపెనీ లోగోను ఉపయోగించడంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించింది. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ట్విటర్లో వివరించింది.
