- మూడుసార్లు వార్నింగ్ ఇచ్చాం
- అంతా బాగుంది.. మేనేజ్ చేస్తానన్నడు
- పాక్ విమాన ప్రమాదంపై సీఏఏ రిపోర్టు
కరాచీ: ల్యాండింగ్ టైమ్లో విమానం ఎత్తులో ఉండడం, స్పీడ్ కూడా ఎక్కువగా ఉండడం వల్లే పాకిస్తాన్ ఫ్లైట్ కూలిపోయిందని ప్రమాదంపై ఏర్పాటైన ఎంక్వైరీ కమిటీ ప్రాథమికంగా తేల్చింది. దీనిపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) వార్నింగ్ ఇచ్చినా పైలట్ వినిపించుకోలేదని సివిల్ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) రిపోర్టు వెల్లడించింది. ఈ నెల 22న పాకిస్తాన్ లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న పీకే–8303 విమానం జనముండే కాలనీలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 97 మంది చనిపోయారు. ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ మొరాయించడమేనని ముందు అనుకున్నా .. ఏటీసీ డైరెక్షన్లను పైలట్పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సాధారణంగా ల్యాండింగ్ టైమ్లో విమానం రన్ వే ను సమీపిస్తున్న కొద్దీ ఎత్తును, వేగాన్ని పైలట్ నెమ్మదిగా తగ్గిస్తారు. విమానం రన్వేకు ఎంత దూరం ఉందనే దానిని బట్టి అది ఎగరాల్సిన హైట్ను, స్పీడ్ను ఏటీసీ సూచిస్తుంది. దీనికోసం నిర్దేశిత ప్రమాణాలను పాటించాలి. పీకే 8303 విమానం పైలట్ మాత్రం ఈ వార్నింగ్లను లెక్కచేయలేదని ప్రాథమిక రిపోర్టులో వెల్లడైంది.
రన్వేను తాకడంతో ట్యాంకర్కు పగుళ్లు..
ఎయిర్ పోర్టు మరో 15 నాటికల్ మైల్స్ ఉందనగా ఫ్లైట్ 7 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉండగా.. పీకే 8303 మాత్రం 10 వేల అడుగుల హైట్లో ప్రయాణించిందని ఏటీసీ అధికారులు చెప్పారు. దీనిపై పైలట్ వార్నింగ్ ఇచ్చామన్నారు. ఈ విషయంలో తాను సంతృప్తిగా ఉన్నానని, పరిస్థితిని తాను హ్యాండిల్ చేస్తానని చెప్పారన్నారు. తర్వాత 10 నాటికల్ మైల్స్ దగ్గర్లోకి వచ్చాక 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సిన విమానం 7 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని అన్నారు. నిర్ణయించిన స్పీడ్ కన్నా చాలా ఎక్కువ స్పీడ్లో రన్ వేను అప్రోచ్ అయ్యిందని అధికారులు చెప్పారు. అ వేగంతో ఫ్లయిట్ కింది భాగం రన్వేను తాకడంతో ఆయిల్ ట్యాంకర్కు పగుళ్లు ఏర్పడి, ఆయిల్ లీక్ అయిందన్నారు. ల్యాండింగ్ అటెంప్ట్ ఫెయిల్ కావడంతో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి తీసుకెళ్లి, రెండోసారి ల్యాండ్ చేసేందుకు ట్రై చేశాడని చెప్పారు. ల్యాండింగ్ గేర్ ట్రబుల్ ఇవ్వడంతోనే మళ్లీ గాల్లోకి లేచినట్లు చెప్పిన పైలట్.. రెండో అటెంప్ట్లోనూ ఫ్లైట్ను ల్యాండ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత మరోసారి ల్యాండింగ్కు ట్రై చేయగా.. అప్పటికే ఆయిల్ ట్యాంక్ లీక్ కావడం, కిందిభాగం దెబ్బతినడంతో ఫ్లయిట్ కూలిపోయిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ రిపోర్టు వెల్లడించింది. లాహోర్ నుంచి కరాచీకి ట్రావెల్ టైమ్ గంటన్నర పడుతుంది. అయితే ఫ్లయిట్లో రెండున్నర గంటల పాటు ప్రయాణించేందుకు అవసరమైన ఫ్యూయెల్ ఉందని పేర్కొంది. విచారణ కమిటీ మూడు నెలల్లో పూర్తి రిపోర్టు ఇస్తుందని అధికారులు చెప్పారు.