
హైదరాబాద్ సిటీ, వెలుగు: శిల్పా లేఅవుట్ ఫేజ్–2(పీజేఆర్) ఫ్లైఓవర్ ను శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. స్ట్రాటజిక్రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద రూ. 182.72 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు.
1.2 కి.మీ పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ ఫ్లైఓవర్పై ప్రయాణం రెండు నిమిషాల 25 సెకన్ల పాటు కొనసాగుతుంది. నిత్యం ఈ రూట్ లో 50 నుంచి 60 వేల వాహనాల రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్సమస్యలు వస్తున్నాయి. ఈ ఫ్లై ఓవర్నిర్మాణంతో ఆ తిప్పలు తప్పనున్నాయి.