కార్పొరేటర్ ఇంట్లోపేకాట ఆపై బెదిరింపులు

కార్పొరేటర్ ఇంట్లోపేకాట ఆపై బెదిరింపులు

తార్నాక కార్పొరేటర్, ఆమె భర్తపై కేసు

హైదరాబాద్, వెలుగు: కార్పొరేటర్ ఇంట్లో పేకాట, ఆపై బెదిరింపులు ఘటనపై ఓయూ పీఎస్ లో కేసు ఫైల్అయింది. ఎస్ఐ నర్సింగరావు, బాధితుల వివరాల ప్రకారం.. ముషీరాబాద్ లో ఉండే చికోటి ప్రదీప్ కుమార్, అంబర్ పేట కి చెందిన నిఖిల్, గణేశ్.. ఈ నెల 4న మరో ఫ్రెండ్ విక్కీ తార్నాక కార్పొరేటర్ ఇంట్లో ఆమె భర్త హరితో పేకాడుదామని వీరికి చెప్పాడు.

నలుగురు అక్కడికి వెళ్లి ఆడగా.. హరి అనుచరులు రూ.80వేలు పోగొట్టుకున్నారు. 5న మరోసారి ఈ నలుగురిని హరి అనుచరులు పేకాడేందుకు పిలిచి, తమను మోసం చేశారంటూ రూ.7 లక్షలు ఇవ్వాలని ఇంట్లో బంధించారు. రూ.2.5 లక్షలు ఇస్తామని నిఖిల్ ఒప్పుకొన్నా.. హరి, అతడి అనుచరులు తనను, గణేశ్ ను కారులో ఎక్కించుకుని పలు ఏరియాల్లో తిప్పుతూ కొట్టారని ప్రదీప్ కంప్లయింట్లో పేర్కొన్నాడు. చివరకు తన తండ్రి హామీ మేరకు వదిలి పెట్టారని తెలిపాడు. అతడి కంప్లయింట్ తోనే కార్పొరేటర్ సరస్వతి, హరి, ముగ్గురు అనుచరులపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.