గజ్వేల్/వర్గల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఓటర్లకు పంచిన పైసలు ఓడిన అభ్యర్థి తిరిగి వసూలు చేశాడు. వర్గల్ మండలం వేలూరు పంచాయతీ10 వార్డు అభ్యర్థి నర్సింలు పోలింగ్ కు ముందు రోజు ఓటర్లకు సుమారు రూ. 2 లక్షల వరకు పంపిణీ చేశాడు. గత గురువారం పోలింగ్ జరగ్గా అతనికి 6 ఓట్లు మాత్రమే రాగా ఆశ్చర్యపోయాడు.
రెండు రోజులుగా డబ్బులు ఇచ్చిన ఓటర్ల వద్దకు వెళ్లి తిరిగి ఇవ్వాలని వసూలు చేస్తున్నాడు. తనకు ఓట్లు వేయలేదని, ఇచ్చిన డబ్బులు వెంటనే ఇవ్వాలని నిలదీస్తుండడంతో చేసేదేం లేక తిరిగి ఇస్తున్నారు. అతను డబ్బులు వసూలు చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
