రేపు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు

రేపు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు

న్యూఢిల్లీ: దేశంలోని రైతుల ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు గురువారం జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి రూ. 19 వేల కోట్లను కేంద్రం జమ చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ సమయంలో ఈ డబ్బుల్ని విడుదల చేయనున్నారు. కిసాన్ సమ్మాన్ స్కీమ్ ద్వారా ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో మూడు కిస్తుల రూపంలో  రూ.6 వేలు ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు ఏడు కిస్తీల్లో రూ. 2 వేలు చెల్లిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎనిమిదో విడతగా మరో రెండు వేలను అన్నదాతల అకౌంట్లలో వేస్తోంది.