మోడీ బిలియనీర్ దోస్తుల బాగు మాత్రమే చూసుకుంటడు

మోడీ బిలియనీర్ దోస్తుల బాగు మాత్రమే చూసుకుంటడు

హరిద్వార్:  ప్రధాని నరేంద్ర మోడీ 21వ శతాబ్దపు రాజు అని, కరోనా విపత్తు సమయంలోనూ రైతులను ఏడాదిపాటు రోడ్డుపై వదిలేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రజలను ఎప్పుడూ దూరం పెట్టబోదని చెప్పారు. శనివారం ఉత్తరా ఖండ్ లోని హరిద్వార్, ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లా కైచాలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. మోడీ కేవలం తన బిలియనీర్ దోస్తుల బాగు మాత్రమే చూసుకుంటాడని, మిగతా వాళ్లను పట్టించుకోడన్నారు. సాయంత్రం హరిద్వార్ లోని హర్ కీ పౌడీ ఘాట్ వద్ద జరిగిన గంగా హారతి కార్యక్రమంలోనూ రాహుల్ పాల్గొన్నారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘‘మీ వద్దకు వచ్చి, మీ సమస్యలను విని, వాటిని పరిష్కరించేందుకు పని చేసే చీఫ్ మినిస్టర్ ను మీకు అందిస్తాం” అని హామీ ఇచ్చారు. ప్రభుత్వ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, తమ ప్రభుత్వం ప్రజలతో కలిసి పని చేస్తుందన్నారు.