ఎంపీ సంతోష్ కుమార్ కు మోడీ లేఖ

ఎంపీ సంతోష్ కుమార్ కు మోడీ లేఖ

గ్రీన్ ఇండియా ఛాలెండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు లేఖ రాశారు ప్రధాని మోడీ. పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. భూమాతను, ప్రకృతిని పూజించడం ఆది నుంచి మన సంప్రదాయం లేఖలో చెప్పారు మోడీ. ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కృషి చేస్తోందన్నారు. వృక్షవేదం పుస్తకం గురించి కూడా మోడీ లేఖలో పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అభినందించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. మోడీ ఇచ్చిన స్ఫూర్తితో కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.