కృష్ణంరాజు మృతి వెండితెరకు తీరని లోటు

కృష్ణంరాజు మృతి వెండితెరకు తీరని లోటు

ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు మరణం పట్ల ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు మృతి చెందడం బాధాకరమన్న మోడీ..  రాబోయే తరాలు ఆయన సినిమా తీపిని, సృజనాత్మకతను గుర్తుంచుకుంటాయన్నారు. సమాజ సేవలోనూ ముందుండే ఆయన రాజకీయ నేతగానూ ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా,  రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారు.

కృష్ణంరాజు ఇక లేరు అనే వార్త జీర్ణించుకోలేక పోతున్నాను. సినీ పరిశ్రమ లో ఎటువంటి వివాదాలు పెట్టుకొని గొప్ప వ్యక్తి. ఆదర్శమైన వ్యక్తి. రాజకీయాల్లో కేంద్రమంత్రి గా పని చేసి మచ్చలేని వ్యక్తిగా బయటకు వచ్చి వ్యక్తి కృష్ణంరాజు.

-సీపీఐ నారాయణ

కృష్ణంరాజు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. మంచు మనోజ్, నిఖిల్ సిద్దార్థ, శర్వానంద్ తో పాటు పలువురు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.