గాంధీ, పటేల్ కలల సాకారం దిశగా పయనం

గాంధీ, పటేల్ కలల సాకారం దిశగా పయనం
  • మీరు తల దించుకునేలా ఏనాడు వ్యవహరించలేదు
  • గాంధీ, పటేల్ కలల సాకార దిశగా పయనం

రాజ్కోట్: ఈ ఎనిమిదేళ్లలో ఏ రోజు కూడా ప్రజలు తలదించుకునేలా వ్యవహరించలేదని పీఎం మోడీ స్పష్టం చేశారు. శనివారం గుజరాత్ లో పర్యటించిన మోడీ... శ్రీ పటేల్ సేవా సమాజ్ నిర్మించిన కేడీపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... ఈ ఎనిమిదేళ్లలో మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ బాయి పటేల్ కన్న కలలను నిజం చేయడానికి నిజాయితీగా పని చేస్తున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేసే క్రమంలోనే పేదరికాన్ని నిర్మూలించడానికి తమ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తోందన్నారు.  అందుకోసం జన్ ధన్ యోజన్ వంటి ఎన్నో  పథకాలు ప్రవేశపెట్టామని, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కోవిడ్ కాలంలో పేదవాళ్ల కోసం ఫ్రీగా బియ్యం పంపిణీ చేయడంతో పాటు... రూ. 100 కోట్లకు పైగా ప్రజలకు ఫ్రీగా వ్యాక్సిన్ వేయించమన్నారు.

మరిన్ని వార్తలు..

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది

స్వతంత్య్ర వీర్ సావర్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్