
పరాక్రమ్ దివస్ సందర్భంగా అండమాన్, నికోబార్లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేరు పెట్టారు. పరమవరి చక్ర విజేతలుగా పిలువబడే ఈ ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహితల పేర్లను నామకరణం చేశారు. ఏటా జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకొని, పరాక్రమ్ దివస్గా నిర్వహిస్తూ నివాళులర్పిస్తోన్న కేంద్రం.. ఈ సారి అండమాన్, నికోబార్ లలోని పేరు లేని అతిపెద్ద దీవులకు పేర్లు పెట్టేందుకు సంకల్పించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం.. అండమాన్ – నికోబార్ దీవుల చారిత్రక ప్రాముఖ్యతను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి 2018లో ద్వీపాన్ని సందర్శించిన సందర్భంగా రాస్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని నామకరణం చేశారు. దేశం కోసం జీవితాన్ని, ప్రాణాన్ని త్యాగం చేసిన రియల్ హీరోస్ కు ప్రధాని మోడీ ఈ విధంగా వారికి నివాళులర్పించారు.
21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు ఇవే..
- మేజర్ సోమనాథ్ శర్మ
- సుబేదార్ – హోనీ కెప్టెన్ (అప్పటి లాన్స్ నాయక్) కరమ్ సింగ్
- 2వ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే
- నాయక్ జాదునాథ్ సింగ్
- కంపెనీ హవల్దార్ మేజర్ పిరు సింగ్
- కెప్టెన్ GS సలారియా
- లెఫ్టినెంట్ కల్నల్ (అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా
- సుబేదార్ జోగిందర్ సింగ్
- మేజర్ షైతాన్ సింగ్
- సీక్యూఎంహెచ్ అబ్దుల్ హమీద్
- లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్
- లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా
- మేజర్ హోషియార్ సింగ్
- 2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్
- ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్
- మేజర్ రామస్వామి పరమేశ్వరన్
- నాయబ్ సుబేదార్ బనా సింగ్
- కెప్టెన్ విక్రమ్ బాత్రా
- లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే
- సుబేదార్ మేజర్ (అప్పటి రైఫిల్ మాన్) సంజయ్ కుమార్
- సుబేదార్ మేజర్ రిటైర్డ్ (హానీ కెప్టెన్) గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్.