కైకాల సత్యనారాయణ మృతి పట్ల చింతిస్తున్నా: ప్రధాని మోడీ

కైకాల సత్యనారాయణ మృతి పట్ల చింతిస్తున్నా: ప్రధాని మోడీ

కైకాల సత్యనారాయణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రసిద్ధ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతి పట్ల చింతిస్తున్నానని అన్నారు. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులని కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి అని ట్వీట్ చేశారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ  ఇవాళ తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కైకాల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో  రేపు మహాప్రస్థానంలో జరగనున్నాయి.