
ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తాను ప్రధానమంత్రిగా భావించలేదని..కేవలం ఫైల్స్ పై సంతకం చేసినప్పుడు మాత్రమే ప్రధాన మంత్రిగా భావిస్తానని అనంతరం తాను 130 కోట్ల ప్రజలకు సేవకుడిగా తాను భావించడం జరుగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 2014 కంటే ముందు ఇప్పుడు ఎంతో సురక్షితంగా ఉందని ప్రతిపక్షాలపై విమర్శించారు. భారత్ అమలు చేస్తున్న పథకాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని అంతేగాకుండా భారత్ స్టార్టప్ ల ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు వెల్లడించారు. భారతదేశ సరిహద్దులు గతంలో ఖంటే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరగాలని, పేద ప్రజలకు నేరుగా వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు.
అవినీతి విషయంలో గత ప్రభుత్వాలు ఏమి చేయలేదని, ప్రజల వద్దకు చేరుకోకుండానే డబ్బులను లూఠీ చేశారని విమర్శించారు. ధన్ జన్ యోజన ఖాతా ద్వారా ప్రజలకు డబ్బులు అందుతున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కారు ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మే 31వ తేదీ మంగళవారం ఆయన సిమ్లాలో పర్యటించారు. రిడ్జ్ మైదాన్ కు వెళుతున్న సమయంలో ఆయనపై ప్రజలు పూల వర్షం కురిపించారు. అనంతరం నిర్వహించని గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ లో ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ముచ్చటించారాయన.
మరిన్ని వార్తల కోసం :-
జూన్ 2న బీజేపీలోకి హార్దిక్ పటేల్ ?
చిన్నారికి తొలి కుల, మత రహిత సర్టిఫికెట్