బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే: మోడీ

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే:  మోడీ

బీఆర్ఎస్,కాంగ్రెస్ పై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోడీ. అసమర్థ బీఆర్‌ఎస్‌ పాలనతో  తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై కూడా అంతే విసిగిపోయారని చెప్పారు. BRS, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. రెండు పార్టీలకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం   లేదన్నారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ కు వస్తున్నానన్న మోడీ..ర్యాలీలో ప్రసంగిస్తానని చెప్పారు.

మహబూబ్‌నగర్‌లో రూ. 13 వేల 500 కోట్లకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో  సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు మోడీ.

అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ కు రానున్న మోడీ.. మళ్లీ అక్టోబర్ 3న నిజామాబాద్ కు రానున్నారు. నిజామాబాద్ లో రోడ్ షోతో పాటుగా భారీ బహిరంగ సభ ఉంటుందని తెలుస్తోంది.