ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అహ్మదాబాద్లోని UN మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్ స్పష్టం చేసింది. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోందని తెలిపింది. మంగళవారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో హీరాబెన్ ను ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని వెంటనే అహ్మదాబాద్ చేరుకుని, తల్లిని పరామర్శించారు. మోడీతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూడా ఉన్నారు. తల్లిని చూసిన తర్వాత కాసేపటికి మోడీ తిరిగి వెళ్లిపోయారు.
మీకు మద్దతుగా మేమున్నం.. హీరాబెన్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ట్వీట్ చేశారు. ‘‘హీరాబెన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మోడీకి మద్దతుగా మేమున్నాం” అని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, డీకే అరుణ ట్వీట్ చేశారు. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడిన ధాని మోడీ సోదరుడు, కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు బుధవారం ప్రకటించారు. కొడుకు, కోడలు, మనవడితో కలిసి ప్రయాణిస్తున్న ప్రహ్లాద్ మోడీ కారు మంగళవారం మైసూరు దగ్గరలో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వాళ్లందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ‘‘మాకు చిన్నపాటి గాయాలయ్యాయి. అందరమూ బాగానే ఉన్నాం, చింతించాల్సిన పనిలేదు”అని ప్రహ్లాద్ మోడీ వెల్లడించారు.