అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని మోడీ

అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని మోడీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్‌ కుటుంబంతో భారత్‌ పర్యటనకు వస్తున్నారు.  ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోడీతో కలిసి డొనాల్డ్ ట్రంప్ రోడ్‌షోలో పాల్గొననున్నారు. తర్వాత మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరవుతారు. అమెరికా అధ్యక్షుడి పర్యటన క్రమంలో అహ్మదాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరికొద్ది సమయంలో అమెరికా అధ్యక్షుడు అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.