భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో పర్యటించారు. శుక్రవారం అకస్మాత్తుగా వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న దుకాణదారులతో మాట్లాడారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులతో కూడా ప్రధాని మాట్లాడారు. దీంతో అక్కడున్న జనం మోడీని చూసి నినాదాలు చేశారు. మోడీ మోడీ.. అంటూ స్లోగన్స్ చేశారు. దీంతో రైల్వే స్టేషన్ అంతా ఒక్కసారిగా సందడిగా మారింది.
వారణాసి ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం. శుక్రవారం, మోడీ ఉత్తరప్రదేశ్లో చివరి దశ ఎన్నికల ప్రచారం కోసం వారణాసిలో భారీ రోడ్షో నిర్వహించారు. ప్రజలు రోడ్షోలో ఉత్సాహంగా పాల్గొని నినాదాలు చేశారు. అయితే రోడ్షో ముగిసిన తర్వాత, ప్రధాని టీ స్టాల్లో టీ తాగడం కోసం ఆగారు. 'కుల్హర్'లో వేడి టీను సిప్ చేశారు. అనంతరం శుక్రవారం కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేశారు. యూపీలో చివరి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 7 న జరగనుంది.
#WATCH | Prime Minister Narendra Modi visited Varanasi Cantt Railway Station last night. He also interacted with shopkeepers. pic.twitter.com/ydx9VBYQ3Q
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022