పుణె, బీదర్‎లో చిక్కిన ముగ్గురు ఖజానా దొంగలు..?

పుణె, బీదర్‎లో చిక్కిన ముగ్గురు ఖజానా దొంగలు..?

చందానగర్, వెలుగు: చందానగర్​ పరిధిలోని ఖజానా జ్యువెల్లరీలో దోపిడీ చేసిన ఆరుగురిలో ముగ్గురు దొంగలు స్పెషల్​టీమ్స్‎కు చిక్కినట్టు తెలుస్తోంది. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, పుణెలో ఒకరు, బీదర్‎లో మరో ఇద్దరు పట్టుబడ్డట్టు సమాచారం. ఈ నెల 12న ఉదయం ఆరుగురు దుండగులు చందానగర్​గంగారంలోని ఖజానా జ్యువెల్లరీకి వచ్చి డిప్యూటీ మేనేజర్​పై కాల్పులు జరిపి వెండి వస్తువులతో పరారైన సంగతి తెలిసిందే.

రెండు బైకులపై పటాన్​చెరు వైపు పారిపోగా, సైబరాబాద్​ సీపీ 12 స్పెషల్​టీమ్స్​ఏర్పాటు చేశారు. ఇందులో రాజేంద్రనగర్ జోన్‎కు చెందిన బృందానికి పుణెలో ఒకరు దొరకగా, ఇతడు ఇచ్చిన సమాచారంతో బీదర్‎లో మరో ఇద్దరు చిక్కినట్టు తెలుస్తోంది. వీరిని నేడో, రేపో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.