రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘ఏమో ఏమో ఇది’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయగా, తాజాగా పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేశారు. ‘హిట్’ ఫ్రాంచైజీతో మాస్ మూవీస్ను రూపొందించిన శైలేష్ ఈసారి ఓ రొమాంటిక్ లవ్స్టోరీను తెరకెక్కిస్తున్నాడు.
‘మూడు హృదయాలు.. ఒకే కల.. ఇదొక అందమైన ప్రారంభం. కొంతకాలంగా మేము నిశ్శబ్దంగా నమ్ముతున్న ఒక బలమైన అనుభూతిని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం’ అని ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
