హైదరాబాద్,వెలుగు : అడ్వర్టయిజ్మెంట్స్ కాంట్రాక్ట్ పేరుతో ఆర్టీసీ నుంచి రూ.21.72కోట్లు కొట్టేసిన ఓ ప్రైవేట్ సంస్థ ఓనర్ను సిటీ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వడ్డన్న సునీల్ కుత్బుల్లాపూర్ చింతల్లో ఉంటూ.. ‘గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు.
అతడు ఆర్టీసీకి చెందిన అడ్వర్టయిజ్మెంట్ కాంట్రాక్ట్లు తీసుకున్నాడు. హైదరాబాద్ రీజియన్కు సంబంధించి రూ.10,74 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్కు చెందిన రూ.10,97 కోట్లు కలిపి మొత్తం రూ. 21,72 కోట్ల డబ్బు ఆర్టీసీకి చెల్లించలేదు. దీంతో టీఎస్ఆర్టీసీ సిటీ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సునీల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.