కస్టమర్ల KYC, ఫింగర్ప్రింట్లు దుర్వినియోగం చేసిన ఎయిర్ సిమ్ డిస్ట్రిబ్యూటర్ల అక్రమం దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు.. వొడాఫోన్ ఐడియా కస్టమర్ల పేర్లను, వారి కేవైసీ, ఫింగర్ ప్రింట్లను వినియోగించి అక్రమంగా దాదాపు 200 ఎయిర్ టెల్ సిమ్ లను యాక్టవేట్ చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ స్పెషల్ క్రైం టీమ్, నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
అక్రమంగా ఎయిర్ టెల్ సిమ్ లను యాక్టివేట్ చేసి అధిక ధరలకు అమ్ముతూ అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తున్న కడపజిల్లాకు చెందిన ఇద్దరుయువకులను ఆదివారం (జనవరి 18) సీసీఎస్ స్పెషల్ క్రైం టీమ్, నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా యాక్టివేట్ చేసిన 184 సిమ్ లను స్వాధీనం చేసుకున్నారు. అందులో 150 ఎయిర్ టెల్ సిమ్ లు, 34 జియో సిమ్ కార్టులు ఉన్నాయి.
సిమ్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నడుపుతూ కస్టమర్లకు తెలియకుండా వారి KYC, ఫింగర్ ప్రింట్లను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు నిందితులు. వొడాఫోన్ ఐడియా కస్టమర్ల పేర్లపై ఎయిర్ టెల్ సిమ్ లను యాక్టివేట్ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నిందితులనుంచి 4 సెల్ ఫోన్లు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు చూపించే ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నాంపల్లి స్టేషన్ లో అప్పగించారు.
