డోర్నకల్ మాజీ ఎమ్మెల్యేపై కేసు

డోర్నకల్ మాజీ ఎమ్మెల్యేపై కేసు

డోర్నకల్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే  రెడ్యానాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం డోర్నకల్ టౌన్ గాంధీ సెంటర్ లో కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిచుకుంటుండగా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్  పార్టీ శ్రేణులతో కలిసి రూల్స్ కు విరుద్ధంగా ర్యాలీ తీస్తూ  గాంధీ సెంటర్ కు వచ్చారు. దీంతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారి తీసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో  మంగళవారం మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తో పాటు 17 మందిపై  కేసు నమోదు చేసినట్లు  డోర్నకల్ సీఐ రాజేశ్ తెలిపారు.