- రంజాన్ ప్రార్ధనలు ఇళ్లలోనే చేసుకోవాలని సూచన
రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులంతా ప్రార్థనలను తమతమ ఇళ్లలోని నిర్వహించుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆరంఘర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ల వద్ద శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో కలిసి తనిఖీల్లో పాల్గొన్నారు. కమిషనరే స్వయంగా వాహనాలను తనిఖీలు చేపట్టి వారి వివరాలను సేకరించారు. ఎలాంటి పనులు లేకుండా కేవలం సరదాగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను గుర్తించి వారి వాహనాలను జప్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు లాక్డౌన్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉంటే ఈ పాస్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.