మెదక్, హుస్నాబాద్ లో ఫ్లాగ్ మార్చ్ : మెదక్ అడి షనల్ ఎస్పీ మహేందర్

మెదక్, హుస్నాబాద్ లో ఫ్లాగ్ మార్చ్ : మెదక్ అడి షనల్ ఎస్పీ మహేందర్

మెదక్​ టౌన్, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మెదక్​ అడిషనల్​ ఎస్పీ మహేందర్​ సూచించారు. శుక్రవారం రాత్రి మెదక్​ పట్టణంలో పోలీసులు ఫ్లాగ్​ మార్చ్​ నిర్వహించారు. టౌన్  పోలీస్ స్టేషన్  నుంచి ప్రారంభమైన ఫ్లాగ్​ మార్చ్​ న్యూ బస్టాండ్, అంబేద్కర్  సర్కిల్,  ఓల్డ్  బస్టాండ్,  గర్ల్స్ హైస్కూల్, పొట్టి శ్రీరాములు విగ్రహం, చమన్  హనుమాన్  టెంపుల్  మీదుగా రాందాస్  చౌరస్తా వరకు కొనసాగింది.

మున్సిపల్​  ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, భయభ్రాంతులకు లోనుకాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్  సీఐ మహేశ్, రూరల్  సీఐ జార్జ్  పాల్గొన్నారు.

హుస్నాబాద్​లో.. 

హుస్నాబాద్ లో శుక్రవారం ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో సుభాష్ నగర్, గోదాం గడ్డ, రెడ్డి కాలనీ మీదుగా మెయిన్  సెంటర్​ వరకు ఫ్లాగ్​ మార్చ్​ నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సీఐ శ్రీను, ఎస్సైలు లక్ష్మారెడ్డి, అభిలాశ్​ పాల్గొన్నారు.