
హైదరాబాద్ వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కేస్ను గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుబ్దులాపూర్ లోని ఓ భూవివాదం కిడ్నాప్ కు కారణం అని తేల్చారు. డబ్బుల విషయంలో తెలిసిన వ్యక్తులే కిడ్నాప్ చేశారని పోలీసులు భావిస్తున్నారు. తీసుకున్న డబ్బు ఇవ్వకపో వడంతో హైకోర్ట్ అడ్వకేట్ పాలడుగు నారాయణను దుండగులు కిడ్నాప్ చేసినట్లు చెప్పారు పోలీసులు
అసలేం జరిగిందంటే.?
జూన్ 9న ఉదయం హైదరాబాద్ వనస్థలిపురంలోని సరస్వతినగర్ SNR అపార్ట్ మెంట్ నుంచి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పని చేస్తున్న పాలడుగు నారాయణను.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. అడ్వొకేట్ నారాయణను కిడ్నాప్ చేసిన తర్వాత.. నిందితులు అతని భార్యకు కాల్ చేశారు. కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కిడ్నాపర్లు.
ఈ విషయాన్ని అడ్వొకేట్ భార్య.. పోలీసులకు కంప్లయింట్ చేయటంతో బయటకు వచ్చింది. కిడ్నాప్ అయిన నారాయణ కోసం.. కిడ్నాపర్ల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. కిడ్నాపర్లు కాల్ చేసిన లొకేషన్, నెంబర్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలించి గుంటూరులో కిడ్నాప్ చేసిన వ్యక్తులను పట్టుకొని వనస్థలిపురం తీసుకువచ్చారు పోలీసులు. అడ్వొకేట్ ను సురక్షితంగా రక్షించారు.